COVID-19: కరోనా విపరీతమైన డిప్రెషన్..గుండె జబ్బులు.. పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు..

వైరస్ కారణంగా మనిషిలో విపిరీతమైన ఒత్తిడి పెరిగిందని పరిశోధకులు వివరిస్తున్నారు. కరోనా సోకినా, సోకకపోయినా మనిషిలో అంతర్లీనంగా ఏర్పడిన భయం, ఫోబియా కారణంగా గుండె జబ్బులు చుట్టుముడుతున్నట్లు గుర్తించామన్నారు.

కరోనా వేక్సిన్ కారణంగానే గుండె జబ్బులు వస్తున్నాయా..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసేసింది. వేలాది మంది ప్రాణాలను హరించింది. లక్షలాది మందిని ఆస్పత్రుల పాల్జేసింది. అన్ని రంగాలను కుదేలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. నెమ్మదిగా ఈ సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడుతోంది. ఇదంతా ఒకవైపు అయితే.. కరోనా వైరస్ అనేది మనిషిని మానసికంగా కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ కారణంగా మనిషిలో విపిరీతమైన ఒత్తిడి పెరిగిందని వివరిస్తున్నారు. కరోనా సోకినా, సోకకపోయినా మనిషిలో అంతర్లీనంగా ఏర్పడిన భయం, ఫోబియా కారణంగా గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక రోగాలు చుట్టుముడుతున్నట్లు గుర్తించామన్నారు.

పరిశోధన ఇలా..

కోవిడ్ 19 సమయంలో మనిషి మానసిక స్థితిపై పరిశోధకులు ఓ అధ్యయనాన్ని చేశారు. దాదాపు 136,000 మంది రోగులపై ఈ అధ్యయనం చేశారు. వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా విజృంభించిన సమయంలో మనిషిలో డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు గణనీయంగా పెరిగాయని కనుగొన్నారు. రోగులలో సగానికి పైగా డిప్రెషన్‌లో ఉన్నట్లు నివేదించారు. ఇది గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చని అభిప్రాయ పడ్డారు. వీరిలో డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) కోసం రోగులను పరీక్షించడం, చికిత్స చేయడం చాలా ముఖ్యం అని పరిశోధకులు కనుగొన్నారు. ఈ మానసిక ఆరోగ్య సమస్యలు అధిక రక్తపోటు, జీవక్రియ వ్యాధి, గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు.

రోగుల ఇచ్చిన సమాచారం..

డిప్రెషన్ లక్షణాలు కరోనా పాజిటివ్ రోగులలోనూ, అలాగే సాధారణ ప్రజలలోనూ అదే విధంగా ఉన్నాయిని ఈ పరిశోధన నిర్ధారించింది. పరిశోధనకులు రోగులలోని డిప్రెషన్ ను స్క్రీన్ చేయడానికి ఫస్ట్ పేషంట్ హెల్త్ కేర్ క్వషనరీ-9(పీహెచ్-9) అనే దానిని నిర్వహించారు. దీనిలో కొన్ని ప్రశ్నలు రోగులకు అడిగి సమాధానాలు రాయించారు. ఈ ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన జవాబులను విశ్లేషించిన పరిశోధకులు.. వారి డిప్రెషన్ స్థాయిలను నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ ప్రశ్న పత్రంలో (<10) స్కోర్ వస్తే డిప్రెషన్ అస్సలు లేదని.. 10-14 వస్తే మైల్డ్.. 15-19 వస్తే మోడరేట్ అని.. (>20) వస్తే సివియర్ అని విభాగించారు. మొత్తం మీద దాదాపు 45శాతం మంది రోగుల్లో కరోనా ప్రారంభ సమయంలో కొంత మేర డిప్రెషన్ ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఇది 2021కి వచ్చేసరికి 55 శాతానికి పెరిగింది. దీనిలో కరోనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం.

భవిష్యత్తులో ఇబ్బందులు..

డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, పీఎస్టీడీ, అధిక రక్తపోటు, అధిక స్థాయి కార్టిసాల్‌తో ముడిపడి ఉన్నాయి. ఇది ధమనులలో కాల్షియం ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో గుండె జబ్బులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ శ్వాసకోశాలకు సంబంధించినది కావడం వల్ల దాని ప్రభావం ఊపిరితిత్తులపైనా, ఫలితంగా గుండెపైనా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి నేరుగా గుండె కండరాలపైనా దాడి చేసే అవకాశముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. గుండె పనితీరును ఈ వైరస్‌ తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంటున్నాయి. ఇప్పటి వరకు తేలిన పరిశోధనల ప్రకారం బాధితుల్లో వైరస్‌ తొలుత ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. దీంతో గుండెకు సరిపడినంత ఆక్సిజన్‌ అందక దాని పని తీరు దెబ్బతింటుంది. అంతేకాకుండా గుండె లోపలి కణాల్లో ప్రతి చర్యలు జరిగి మంటపుడుతుంది. తద్వారా గుండెజబ్బులు వచ్చే అవకాశముంటుంది. తాజా పరిశోధనల ప్రకారం వైరస్‌ నేరుగా గుండెపైనే దాడి చేసే వీలుంది. మరోవైపు ఈ వైరస్‌ నేరుగా రక్తనాళాలపై దాడి చేయడం వల్ల రక్తం గడ్డ కట్టే ప్రమాదమూ ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

కొంతమంది కరోనా బాధితులను పరీక్షించగా వారి శరీరంలో చాలా చోట్ల రక్తం గడ్డకట్టుపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే వారికి కరోనా సోకిన తర్వాత గడ్డలు ఏర్పడ్డాయా? లేదా అంతకు ముందు నుంచే ఇలా ఉందా? అనే విషయంపై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా వైరస్‌ పట్ల చాలా జాగ్రత్త వహించాలని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డా.సీన్‌ పిన్నేయ్ వెల్లడించారు. అంతేకాకుండా అప్పటి వరకు గుండె సంబంధిత వ్యాధులేవీ లేనప్పటికీ, కరోనా వైరస్‌ సోకిన తర్వాత వచ్చే అవకాశముందని అన్నారు. ఈ మేరకు కొందరిలో ఆ లక్షణాలను గుర్తించామన్నారు. ఇదే విషయాన్ని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించామన్నారు. దీని ప్రకారం కరోనా వైరస్‌ సోకిన వారిలో దాదాపు 25 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి, కొన్ని సెంటర్లలో ఇది 30 శాతంగానూ నమోదవుతోంది.

కరోనా వైరస్‌ సోకిన  కొందరిలో ఎంజైమ్‌ల స్థాయిల్లో మార్పులు రావడం, గుండె పనితీరు మందగించడం వంటి సమస్యలు గుర్తించినట్లు మరో పరిశోధనలో తేలింది. అయితే ఈ సమస్య తాత్కాలికమా? శాశ్వతమా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కరోనా వైరస్‌ గుండెపై నేరుగా ప్రభావం చూపిస్తుందనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలను కూడా సేకరించారు. ఒకరు న్యుమోనియాతో మరణించగా.. మరో నలుగురు అథ్లెట్లల్లో గుండె కణజాలల మధ్య మంట పుడుతున్నట్లు స్కానింగ్‌ ద్వారా గుర్తించారు. కరోనా సోకక ముందు వారిలో అలాంటి లక్షణాలేమీ లేవు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని టామ్‌ మేడాక్స్‌ అనే వైద్య నిపుణుడు వెల్లడించారు. మరింత అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.