ప్రముఖ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) త్వరలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడారు. ‘రంగమార్తాండ’ ప్రారంభానికి ముందు ‘ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని తెలిపారు. ‘‘నేను మాతృక చిత్రం ‘నట్సామ్రాట్’ (మరాఠీ)ని చూశా. ఇలాంటి సీరియస్ సినిమాని ఎవరుచూస్తారని అడిగా.
ఆయన వినిపించుకోకుండా చిత్రీకరణ ప్రారంభించారు. ఇందులోని ఓ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపికకాకపోవడంతో ‘నేను చేస్తా’ అని చెప్పా. కళ్లతోనే నటించాలన్నారు. ఎమోషనల్ చిత్రాలను నేను చూడను’’ అని అన్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణతోపాటు ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది.