AP SSC: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి పరీక్షల్లో కొత్త రూల్స్..

AP 10th Class Exams: పూర్తి వివరాలివే!

💢ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

💢ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

💢పరీక్ష కేంద్రాల్లోని సెల్ ఫోన్ ను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ అబ్జర్వర్లు, డిపార్మెంట్ అధికారులు, ఇన్వెజిలేటర్లు సైతం ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు అధికారులు.

💢నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సెల్ ఫోన్లను ఎగ్జామ్ సెంటర్లలోకి తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జామ్ సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.

💢ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. విద్యార్థులను కేంద్రాల్లోకి ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

💢ఇంకా.. విద్యార్థులు ఆన్సర్లు రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు. ఇది నిండిన తర్వాత అడిగే మరో 12 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు.

💢ఇంకా సైన్స్ పరీక్షకు 12 పేజీల బుక్ లెట్లు 2 ఇస్తారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఒకటి, బయోలజీకి మరో బుక్ లెట్ ఇవ్వనున్నారు.